లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ మంగళవారం మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనులను తీవ్రంగా అణిచివేతకు గురిచేస్తోందని ఆరోపించారు.