కరీంనగర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు నిర్వహించగా మంచిర్యాల శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సీనియర్స్ వాలీ బాల్, త్రో బాల్, ఖో ఖో లో మంచిర్యాల విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచారు. అంతే కాక చెస్ క్యారమ్లో కూడ జూనియర్లు ప్రథమ స్థానంలో నిలిచారు. 100 మీటర్ల పరుగులో మంచిర్యాల బాలిక ప్రథమ స్థానంలో నిలిచింది.