తెలంగాణ మీ సేవ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా మందమర్రికి చెందిన కొత్తపల్లి సత్యనారాయణ ఎన్నికయ్యారు. స్థానిక లయన్స్ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంగళవారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా అంకం వాసు, ఉపాధ్యక్షులుగా జాడి జనార్దన్, గుండ పవన్ కుమార్, బైరి సత్యనారాయణ, కొత్తవడ్ల ప్రవీణ్ కుమార్, కోశాధికారిగా చిలుకమారి కేశవులు, మీడియా కన్వీనర్గా కొంపల్లి సతీష్ నియమితులయ్యారు