మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ ఏరియాలో ఎసిపి ప్రకాష్ ఆధ్వర్యంలో బుధవారం పట్టణ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో తనిఖీలు నిర్వహించి అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలు ఆరా తీశారు. అలాగే సరైన పత్రాలు లేని 65 మోటార్ సైకిళ్ళు, 5 ఆటోలు, 10 ఆటో ట్రాలీలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టేందుకు పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.