పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో పని ప్రదేశాల్లో ఉపాధి కూలీలకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అధికార యంత్రాంగం కనీస వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతుంది. ఈ దృశ్యం గురువారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలోనిది. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు.