మానవ నిత్య జీవితంలో గణాంకాల పాత్ర ఎంతో ముఖ్యమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్ లో ప్రొపెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతి సందర్భంగా 18వ జాతీయ గణాంక దినోత్సవ వేడుకలకు హజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా, మండల గణాంక దర్శిని పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలను సంబంధిత శాఖల అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.