పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందిన ముగ్గురు ఎస్ఐలను బుధవారం రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువా, పూలమాలతో సత్కరించి జ్ఞాపిక అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారులు పోలీస్ శాఖకు అందించిన సేవలు అమోఘం అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జీవితం ఆనందంగా గడపాలన్నారు.