మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మ్యాన అక్షయ బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. విజయలక్ష్మి తెలిపారు. ఈమె 10వ తరగతిలో 571 మార్కులు సాధించి మండలంలో టాపర్ గా నిలిచింది. ట్రిపుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించారు.