ముగిసిన మార్క్ జుకర్‌బర్గ్‌ విచారణ

68చూసినవారు
ముగిసిన మార్క్ జుకర్‌బర్గ్‌ విచారణ
యాంటీ ట్రస్ట్ ట్రయల్‌లో భాగంగా మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ విచారణ ముగిసింది. సోషల్‌ మీడియా రంగంలో ఏకాధిపత్యం కోసం మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌లను కొనుగోలు చేసిందని US FTC చేసిన ఆరోపణలను జుకర్‌బర్గ్‌ ఖండించారు. కంపెనీల విలువను గుర్తించి, వ్యాపార పరంగా అవకాశాలు ఉండటంతో వాటిని కొనుగోలు చేశానని ఆయన స్పష్టం చేశారు. ఇది పోటీని నిర్మూలించడానికి చేసిన ప్రయత్నం కాదని జుకర్‌బర్గ్‌ వివరించారు.

సంబంధిత పోస్ట్