అమెరికాలోని టెక్సాస్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వరదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద ప్రవాహానికి 24 మంది మృతి చెందగా, 20 మందికి పైగా పిల్లలు గల్లంతయ్యారు. వేసవి శిబిరానికి హాజరైన పిల్లలు ఆకస్మిక వరదల్లో గల్లతైయ్యారు. పిల్లల ఆచూకీ కోసం వారి తల్లితండ్రులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అధికారులు సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటివరకు 237 మందిని రక్షించామని తెలిపారు.