తెలంగాణలో వెలుగు చూసిన భారీ మోసం (వీడియో)

56చూసినవారు
తెలంగాణలోని హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగు చూసింది. అధిక వడ్డీల పేరుతో డీకేజెడ్ టెక్నాలజీస్ మోసం చేసిందంటూ బాధితులు బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. మాదాపూర్‌లోని ఈ సంస్థ అధిక వడ్డీలు చెల్లిస్తామని రూ.700 కోట్లు సేకరించినట్లు బాధితులు పేర్కొన్నారు. 3 రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసానికి పాల్పడిందని, ఒక్క హైదరాబాద్‌లోనే 18 వేల మంది మోసపోయినట్లు బాధితులు తెలిపారు. ఫిర్యాదు చేసి 15 రోజులైనా పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్