మెదక్ జిల్లా , పాపన్నపేట మండలం, నాగ్సన్ పల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన ఏడుపాయల వనదుర్గ భవాని మాత ఆలయంలో అమ్మవారికి శుక్రవారం
ఉదయాన్నే అర్చకులు అభిషేకం, అలంకరణ , అర్చన, నిర్వహించి అనంతరం హారతిని ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కలగజేశారు. ఆషాడ మాసం శుక్రవారం సందర్భంగా భక్తులు అధికంగా వస్తారు కాబట్టి వారికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.