మెదక్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మెచ్చు నగేష్ మాతృమూర్తి మెచ్చు సత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్ వారి స్వస్థలం సూర్యాపేటకు వెళ్లి నగేష్ ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.