విధులను బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు

75చూసినవారు
మెదక్ జిల్లా కోర్టు కార్యాలయం గేటు ముందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి గురువారం నిరసన వ్యక్తం చేశారు. న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాది పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దానికి సంబంధించిన వారిపై ఉన్నతాధికారులు న్యాయం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతిభద్రతలు పోలీసులు, న్యాయవాదులు సమన్వయంతో ఉంటేనే శాంతి పద్ధతులను కాపాడిన వారము అవుతామని అన్నారు.

సంబంధిత పోస్ట్