ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వీరోచితంగా పోరాడుతున్న భారత సైనికులకు మద్దతుగా శుక్రవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు సైనికులకు మద్దతుగా ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. యుద్ధంలో భారత సైనికులు గెలవాలని ఆకాంక్షించారు.