మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 1, 70,000 చెక్కులను వెల్దుర్తి కొప్పులపల్లిలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి పలువురు లబ్ధిదారులకు శనివారం అందజేశారు. ఆర్థిక స్థితి గతులు బాగాలేక వైద్యం చేయించుకునే స్థోమత లేక అనేక మంది అప్పులు చేసి ఇబ్బందుల పాలవుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.