మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని కూచారం కేజీబీవీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదులు, వాష్ రూంలో పరిశుభ్రతతోపాటు స్టోర్ రూం, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్నా భోజనం చేశారు. భోజనం వసతిపై అడిగి తెలుసుకున్నారు.