మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కేసు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.