మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. మండల పరిధిలోని మన్నే వారి జలాల్పూర్, దామరంచ, ధర్మారం, అందుగులపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. అధికారులు రైతులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.