మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో బిజెపి నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ చౌరస్తాలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.