సంగారెడ్డి జిల్లా హత్నుర మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద 1000 లిటర్స్ మినరల్ మినీ వాటర్ ట్యాంక్ ను గురువారం మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, హత్నుర మండల అధ్యక్షులు క్రిష్ణ ముదిరాజ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.