భారత్-పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్లో సా.4 గంటలకు శాంతి భద్రతలపై కీలక సమావేశం జరుగనుంది. పాక్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన భేటీ నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేంధర్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరుకానున్నారు.