వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో వరుణ్ భార్యను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. తాజాగా లావణ్య కోసం స్వయంగా పిజ్జా తయారు చేసిన వీడియోను ఆమె ఇన్స్టాలో షేర్ చేశారు. రెస్టారెంట్ ఫుడ్కి భిన్నంగా ఆరోగ్యకరమైన, రుచికరమైన భోజనం అందించేందుకు వరుణ్ షెఫ్గా మారారు. ఈ వీడియో నెటిజెన్లను ఆకట్టుకుంటోంది. తేజ్పై అభిమానులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.