ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రశాంత్ కిషోర్ను కలవడంపై మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైనట్లు పేర్కొన్నారు. ప్రశాంత్ కిషోర్ని కలవడంలో ప్రత్యేకం ఏమీ లేదు అని తెలిపారు. తాను అన్ని వర్గాలను కలుస్తానని పీకేను కూడా నార్మల్గానే కలిశానని వెల్లడించారు.