TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లపై బిగ్ అప్డేట్ ఇచ్చారు. జూన్ 2వ తేదీ నుంచి జూన్ 9 వరకు సంబంధించిన లబ్దిదారులకు మొత్తం రూ.22.64 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు 1,549 ఇండ్లు బేస్మెంట్, 481 ఇండ్ల గోడల నిర్మాణం, మరో 117 ఇండ్లు శ్లాబ్ వరకు పూర్తయ్యాయని తెలిపారు. ఇక ప్రతి సోమవారం లబ్ధిదారులకు నిధులను విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.