TG: రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం గతంలో VRO, VRAగా పని చేసిన వారికి GPOలుగా అవకాశం కల్పించామన్నారు. భూభారతి ఫలితాలు ప్రతి పేదవాడికి చేరేలా క్షేత్రస్ధాయిలో పనిచేయాలని అధికారులకు సూచించారు.