తెలంగాణ సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. పెంచిన డైట్ చార్జీలు అమలవుతున్న తర్వాత కామన్ మెనూపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మంత్రి భోజనం చేశారు. లక్ష్య సాధన కోసం ఎలా కృషి చేయాలి, ఎలా విజయం సాధించాలనే విషయంలో విద్యార్థినులకు మంత్రి సూచనలు చేశారు.