కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవితో మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి సీతక్క కేంద్ర మంత్రికి వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలని సీతక్క కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.