TG: అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని అధిష్టానం గుర్తించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సమన్వయం ఉంటేనే జిల్లా అభివృద్ధి చెందుతుందని, ప్రభుత్వ పథకాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని కేబినెట్ మంత్రులకు సీఎం రేవంత్ సూచించినట్టుగా తెలిసింది. అభివృద్ధి పనులు, కార్యక్రమాలు ఏదైనా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు పని చేయాలని సీఎం చెప్పినట్లు సమాచారం.