వారానికి రెండుసార్లు గాంధీ భవన్‌కు మంత్రులు

57చూసినవారు
వారానికి రెండుసార్లు గాంధీ భవన్‌కు మంత్రులు
ప్రజా సమస్యలు తీర్చేందుకు, కాంగ్రెస్ శ్రేణులను కలిసేందుకు ఇకపై వారానికి రెండ్రోజులపాటు తెలంగాణ మంత్రులు గాంధీ భవన్‌కు రానున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఒక్కో మంత్రి చొప్పున గాంధీ భవన్‌కు రానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు.. ప్రజలకు అందుబాటులో ఉండడం, తరచూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవడం వల్ల పార్టీలో జోష్ పెరిగే అవకాశం ఉందని రాష్ట్ర అధిష్ఠానం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్