భారత విదేశాంగశాఖ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్మీట్లో ఆపరేషన్ సిందూర్ వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించనుంది. ఈ ప్రెస్మీట్లో రక్షణ శాఖ ప్రతినిధులు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం వరకు పాకిస్తాన్ పై భారత త్రివిధదళాలు చేసిన చేసిన దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు సమాచారం.