ఉత్తరప్రదేశ్లోని మోడీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. కిరాణా సామాగ్రి కొనడానికి వెళ్లిన ఓ మైనర్ను బండి లాగే జగదీష్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.