TG: మూసీ పునరుజ్జీవనం పై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగపూర్ గార్డెన్స్ బై దిబే బ్రిడ్డ్ను తలపించేలా మీరాలం బ్రిడ్జ్ను నిర్మించాలని తెలిపారు. దానికోసం జూన్లో టెండర్లు పిలవాలని, ఈలోగా అందుకు అవసరమైన సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డీపీఆర్ను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.