ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన అందాల పోటీ, మిస్ వరల్డ్ 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. శనివారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా పోటీలు మొదలవనున్నాయి. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన అందాల భామలు సిటీకి చేరుకున్నారు. ‘మిస్ వరల్డ్- 2024’ విజేతగా నిలిచిన క్రిస్టినా పిస్కోవా (చెక్ రిపబ్లిక్) శుక్రవారం HYD వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో క్రిస్టినాకు సంప్రదాయ రీతిలో
తెలంగాణ అధికారులు ఘనస్వాగతం పలికారు.