TG: హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో దాదాపు 111 దేశాల సుందరీమణులు పాల్గొననున్నారు. అయితే ప్రస్తుతం భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. శత్రు దేశాల ప్రతినిధులతో పోటీలు ఎలా జరుపుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అలాగే అక్రమ వలసదారులను గుర్తించి తరిమేయాలని కోరుతోంది.