పాకిస్తాన్ రోజు రోజుకు దిగజారిపోతుంది. ప్రజలపై దాడులు చేస్తూ.. వారికి భయాందోళనలకు గురిచేస్తోంది. అలాగే భారత్ సైన్యాన్ని రెచ్చగొడుతోంది. అయితే ప్రస్తుతం దేవాలయాలను టార్గెట్ చేస్తోంది. జమ్మూలోని అమృత్ శంభు ఆలయంపై పాక్ మిస్సైల్తో దాడి చేసినట్లు, దేవాలయం బయట ఉన్న భవనం ధ్వంసమైనట్లు ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా పాక్ అమృత్సర్ దేవాలయంపై కూడా దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.