పుదుచ్చేరిలోని నెడుంగడు నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) ఎమ్మెల్యే చంద్ర ప్రియాంక బుధవారం అస్వస్థతకు గురయ్యారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె తన నియోజకవర్గంలో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో వడదెబ్బకు గురవడంతో ఆమెను కార్యకర్తలు ఆసుపత్రికి తరలించారు. గతంలో మంత్రిగా కూడా ఆమె సేవలందించారు. అయితే గతేడాది అక్టోబర్ 10న మంత్రి పదవికి ఆమె రాజీనామా చేశారు.