ఢిల్లీ-భోపాల్ వందే భారత్ రైలులో BJP MLA రాజీవ్ సింగ్కు సీటు మార్చేందుకు నిరాకరించిన ప్రయాణికుడిపై దాడి జరిగింది. UPలోని ఝాన్సీ స్టేషన్లో MLA అనుచరులు అతడిని చెత్తో, చెప్పులతో కొట్టడంతో ముక్కు నుంచి రక్తం కారింది. బట్టలు రక్తంతో నిండిపోయాయి. ఇది సీటు మార్పుపై వివాదమేనని, CC TV ఆధారంగా చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎన్సీఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.