ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెద్ద కేడీలు అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా , రాహుల్ గాంధీకి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు ఈడీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోనే దమ్ము లేక ప్రధాని మోదీ ఈడీని ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు.