పాకిస్తాన్ ఉగ్రదాడుల దృష్ట్యా భారత్ అప్రమత్తమైంది. ఈ మేరకు సరిహద్దు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ ముఖ్యమంత్రులతో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ఎటునుంచైనా దాడులు చేసే అవకాశం ఉన్నందున సరిహద్దులో భద్రతను మరింత పటిష్టం చేయాలని సూచించారు.