ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రాత్రి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 20 మంది కీలక శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, అత్యవసర వ్యవస్థలు నిరంతరాయంగా పనిచేయాలని, సంసిద్ధత, ప్రతిస్పందన, అంతర్గత కమ్యూనికేషన్ ప్రోటోకాల్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అత్యవసర వస్తువుల సరఫరా నిరాటంకంగా కొనసాగాలని, ఉత్తర్వుల కోసం వేచి ఉండకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని సూచించారు.