యువతకు ఉపాధి లేకుండా చేయడమే మోడీ ప్రభుత్వ ఏకైక లక్ష్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం మండిపడ్డారు. నిరుద్యోగంపై వెలువడిన పలు సర్వేలను ఉదహరిస్తూ బిజెపి ప్రభుత్వంపై విమర్శనాస్ర్తాలు సంధించారు. నిరుద్యోగంపై సిటీగ్రూప్ ఇచ్చిన స్వతంత్ర ఆర్థిక సర్వేను కూడా మోడీ ప్రభుత్వం ఖండించవచ్చని ఎద్దేవా చేశారు. అయితే ప్రభుత్వ నివేదికను ఎలా తిరస్కరిస్తారని పేర్కొన్నారు.