పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ నుంచి భారత్కు వినిపిస్తున్న అభ్యర్థనలు ఆసక్తికరంగా మారాయి. పాక్ దమన పాలనపై బలూచ్ ప్రజలు గళం విప్పారు. ‘‘పాక్ను శిక్షించాలంటే మాకు భారత సైనిక సహాయం అవసరం. మోదీ సర్ మిస్సైళ్లతో మద్దతు ఇవ్వండి. బలూచ్ ఫైటర్లు అద్భుతాలు చేసి చూపుతారు. పోరాటమే మా శ్వాస’’ అంటూ పలువురు బలూచ్ నేతలు, పౌరులు ట్విట్టర్లో అభ్యర్థనలు చేస్తున్నారు.