అహ్మదాబాద్లో గురువారం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి 241 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాగా విమాన ప్రమాదానికి ముందు అందులో మణిపూర్కు చెందిన ఎయిర్హోస్టెస్ నాంగ్తోయ్ శర్మ తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడింది. 'అమ్మా.. లండన్ వెళ్తున్నా' అంటూ సంతోషంగా చెప్పింది. ఇది ఆమె చివరి సందేశం. కాసేపటికి జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది