ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాల కన్నా ముందుగానే తెలంగాణలోకి ప్రవేశించనున్నట్లు IMD ప్రకటించింది. ఈ నెల 13న అండమాన్ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని ఐఎండీ ఓ బులిటెన్ విడుదల చేసింది. దీంతో ఈసారి మే నెలాఖరు కల్లా తెలంగాణను తాకునున్నాయి. గతేడాది మే 31న అండమాన్లోకి రాగా.. జూన్ రెండో వారంలో తెలంగాణలో విస్తరించిన విషయం తెలిసిందే.