సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాక్ బలగాలకు వ్యతిరేకంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా నిర్వహించిన ఇండియన్ ఆర్మీకి మద్దతుగా నిలిచారు. ఈ మేరకు నేషనల్ డిఫెన్స్ ఫండ్కు తనవంతుగా ఒక నెల వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా ప్రజాప్రతినిధులు, పౌరులు కూడా విరాళాలు ఇచ్చి ఈ ప్రత్యేక డ్రైవ్లో పాల్గొనాలని కోరారు.