భారత్ ఆర్మీకి మరిన్ని అధికారాలు.. రంగంలోకి దిగిన టెరిటోరియల్ ఆర్మీ

72చూసినవారు
భారత్ ఆర్మీకి మరిన్ని అధికారాలు.. రంగంలోకి దిగిన టెరిటోరియల్ ఆర్మీ
భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో కేంద్రం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేదికి మరిన్ని అధికారాలను అప్పగిస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని పేర్కొంది. సైనిక సామర్థ్యం మరింత బలోపేతం చేసేందుకు టెరిటోరియల్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని పిలిచే అధికారాన్ని ఆర్మీ చీఫ్‌కు కల్పించింది. రెగ్యులర్ ఆర్మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్