తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు పిల్లలకు తల్లైన కౌసల్య (35) అనే మహిళ ఒక యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో జూన్ 10న ప్రియుడి ఫోన్ను చూడగా.. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి. దీంతో అతడిని ఆమె అడగ్గా SMలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.