ఆపరేషన్ సిందూర్తో భారత్ పాకిస్తాన్లో వణుకు పుట్టించించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్లో ఉత్తమ్ నితిన్ దర్శకత్వంలో ఆపరేషన్ సిందూర్ అనే టైటిల్తో సినిమా రానుంది. ఈ మూవీని నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కించనున్నారు. చిత్ర యూనిట్ ఈ మూవీకి సంబంధించిన ఓ పోస్టర్ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఇందులో ఓ మహిళ ఆర్మీ యూనిఫాం వేసుకుని, రైఫిల్ పట్టుకుని, బొట్టు పెట్టుకుంటుంది.