ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖడే వేదికగా గురువారం ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అనంతరం మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలవ్వనుంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. ముంబై పిచ్ బ్యాటర్లకు అనుకూలం. ఈరోజు వాంఖడేలో పరుగుల వరద పారనుంది.